సాయిధరమ్‌ తేజ్‌కు తీవ్ర గాయాలు.. పరిస్థితి విషమం ?

మెగా యంగ్ హీరో సాయిధరమ్ రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. శుక్రవారం సాయంత్రం స్పోర్ట్స్ బైక్ పై వెళ్తున్న సాయిధరమ్ తేజ్ ప్రమాదానికి గురయ్యాడు. కేబుల్‌ బ్రిడ్జ్‌-ఐకియా సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. బైక్ స్కిడ్ అయినట్టు తెలిసింది. ప్రమాదం జరిగిన వెంటనే తేజు అపస్మారక స్థితిలోకి వెళ్లారు. ఆయన ప్రథమ చికిత్స కోసం మొదట దగ్గరల్లో ఉన్న ఓ ప్రయివేటు ఆసుపత్రికి తరలించారు. ఆ తర్వాత అక్కడి నుంచి అపోలో ఆసుపత్రికి షిఫ్ట్ చేశారు.

అతివేగం వలనే ఈ ప్రమాదం జరిగిందని ప్రాథమిక విచారణలో తేలినట్టు మాధాపురం ఎస్సై తెలిపారు. ప్రమాదం జరిగిన సమయంలో తేజు  హెల్మెంట్ ధరించినట్టు ఉన్నాడు. ఆయన తలకు గాయాలేమీ కాలేదు. కానీ పక్కటెముక్కలో గట్టి దెబ్బ తగిలినట్టు సమాచారమ్. ప్రాణాలకు ప్రమాదం ఏమీ లేదని ఇప్పటికే డాక్టర్లు చెప్పినట్టు సమాచారమ్. ప్రమాద వార్త తెలియగానే మెగా ఫ్యామిలీ అంతా హాస్పటల్ కి చేరుకుంది. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హాస్పటల్ కి వచ్చారు. ప్రమాదంపై మీడియాతో మాట్లాదారు. తేజు ఇంకా అపస్మారక స్థితిలోనే ఉన్నారు. మెరుగైన చికిత్స కోసం అపోలో ఆసుపత్రికి తరలిస్తున్నామని తెలిపారు.