పోరి భయపడిందట

రిమేక్ సవాలే అంటోంది ఇస్మార్ట్ పోరి నభా నటాషా. నితిన్ కి జంటగా ఆమె నటించిన చిత్రం ‘మాస్ట్రో’. మేర్లపాక గాంధీ దర్శకుడు. తమన్నా ఓ కీలక పాత్రలో నటిస్తోంది. ఈ సినిమా ఈనెల 17న ప్రముఖ ఓటీటీ వేదిక డిస్నీ ప్లస్‌ హాట్‌స్టార్‌లో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో సినిమా ప్రమోషన్స్ లో పాల్గొన్న నభా ఆసక్తికర విషయాలని పంచుకుంది.

‘అంధాధూన్‌’ బాలీవుడ్‌కు టర్నింగ్‌ పాయింట్‌ లాంటి చిత్రం. మాతృకలో రాధికా ఆప్టే అద్భుతంగా నటించింది. ఆ పాత్రని నేనెలా చేయగలను ? అని భయపడ్డా. ఇది రీమేక్‌ అయినా దర్శకుడు తన విజన్‌తో సినిమాని చాలా కొత్తగా తీశారు. ప్రేక్షకులకి ఓ తెలుగు చిత్రం చూస్తున్న అనుభూతే కలుగుతుంది. నా పాత్ర విషయంలోనూ ఎన్నో మార్పులు చేశారు. అంధుడిగా నితిన్‌ అద్భుతంగా నటించారు. మా ఇద్దరి సన్నివేశాలు, పాటలు బాగా వచ్చాయి. తమన్నా నాకెంతో సహకరించిందని నభా చెప్పుకొచ్చింది.