క్యాన్సర్ కారక ఉత్పత్తికి మహేష్ ప్రచారం చేయడం ఏంటీ ?

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబుపై నెటిజన్స్ మండిపడుతున్నారు. క్యాన్సర్ కారక ఉత్పత్తికి మహేశ్ ప్రచారం చేయడమే ఇందుకు కారణం. బాలీవుడ్ యాక్టర్ టైగర్ పాన్ బహార్ అనే మౌత్ ఫ్రెష్‌నర్ యాడ్‌లో కనిపించారు. ఈ యాడ్‌ను లగ్జరీగా చిత్రీకరించారు. ఆ పాన్ బహర్‌ మౌత్ ఫ్రెష్‌నర్‌ను తినడాన్ని హీరోయిజంగా ఎలివేట్ చేసారు. ఈ యాడ్‌ సోషల్ మీడియాలో వైరల్ అయింది. నిజానికి పాన్ మసాలా, మౌత్ ఫ్రెష్‌నర్ పేరుతో అమ్ముతున్న ఉత్పత్తులు ప్రమాదకరమైనవి పలు వైద్యనివేదికల్లో వెల్లడయింది.

ఊపిరితిత్తులు, కాలేయం, కడుపులో మానని గాయాలకు కారణం అవుతోంది. హెపాటోటాక్సిక్, ఎంజైమ్‌ల స్థాయిని, కార్బోహైడ్రేట్ మరియు లిపిడ్ జీవక్రియను నాశనంచేయడానికి కారణం అవుతుంది. మూత్రపిండాలతో పాటు లైంగిక సామర్థ్యం దెబ్బతీస్తుందని సంతాన సామర్థ్యాన్ని తగ్గిస్తుందని పలు నివేదికల్లో వెల్లడయింది. ఇప్పుడీ.. ఈ ఉత్పత్తులని మౌత్ ఫ్రెషనర్ అంటూ ప్రచారం చేయడంపై విమర్శలు వస్తున్నాయి. దానికి మహేష్ ప్రచారకర్త చేయడం ఏంటని ఆయన అభిమానులు కూడా ప్రశ్నిస్తున్నారు.