ఐదో టెస్ట్ రద్దుపై గంగూలీ వివరణ

భారత్-ఇంగ్లాండ్ జట్ల మధ్య ఐదో టెస్ట్ రద్దయిన సంగతి తెలిసిందే. ఇందుకు ఐపీఎల్ నే కారణమని ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్లు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఐదో టెస్ట్ రద్దుపై బీసీసీ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ వివరణ ఇచ్చారు.

“బీసీసీఐ అంత నిర్లక్ష్యమైన బోర్డు కాదు. ఇతర బోర్డులను కూడా చాలా గౌరవిస్తుంది. జట్టు ఫిజియో నితిన్ పటేల్ కరోనాతో ఐసోలేషన్‌లో ఉన్నాడు ఆ సమయంలో జూనియర్ ఫిజియో యోగేష్ పార్మర్ అందరికీ సేవలందించాడు. కొందరు ఆటగాళ్లకు కరోనా పరీక్షలు కూడా యోగేష్ చేశారు. అవసరమైన వారికి మసాజ్ చేశాడు. అలాంటి యోగేష్‌కు కరోనా పాజిటివ్ రావడంతో ఆటగాళ్లు భయపడ్డారు. కరోనా భయంతో ఆడటానికి నిరాకరించారు. వారి భయాన్ని అర్థం చేసుకోవాలి. ఈ కారణంగానే 5వ టెస్టు రద్దయింది” అని గంగూలీ వివరించారు.