‘రిపబ్లిక్’ సినిమా వాయిదా ?

దేవా కట్టా దర్శకత్వంలో సాయిధరమ్ తేజ్ నటించిన చిత్రం ‘రిపబ్లిక్’. గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 1న ఈ సినిమాను విడుదల చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు ప్రచారం కూడా మొదలైంది. ఇంతలోనే హీరో సాయిధరమ్ తేజ్ దురదృష్టవశాత్తూ రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. ఈ నేపథ్యంలో అక్టోబర్ 1న రిపబ్లిక్ ఉంటుందా ? ఉండదా ? చర్చ జరుగుతుంది.

ఇప్పటికే సినిమా ఫస్ట్ కాపీతో సిద్ధంగా ఉంది. కానీ హీరో సాయిధరమ్ తేజ్ తో ప్రచారం చేయకుండా సినిమాను విడుదల చేయలేరు. పైగా ఓ వైపు హీరోకు యాక్సిడెంట్ అయినప్పుడు, మరోవైపు సినిమాను రిలీజ్ చేయడం నైతికంగా కరెక్ట్ కాదు. అందుకే తమ సినిమా అక్టోబర్ 1కి రావడం లేదంటూ మేకర్స్ ఇప్పటికే సమాచారం అందిస్తున్నారు. కాకపోతే అధికారిక ప్రకటన ఇంకా రాలేదంతే. త్వరలోనే దీనిపై అధికార ప్రకటన రావొచ్చు.

తేజు త్వరగా కోలుకుంటున్నట్టు అపోలోఆసుపత్రి వైద్యులు తెలిపారు. కాలర్ బోన్ శస్త్రచికిత్స నుంచి కూడా ఆయన తొందరగా రికవర్ అవుతున్నట్టు తెలిపారు. అయితే ఇంకా తేజు వెంటిలేటర్ పైనే ఉన్నారు. ఆయన ఎప్పుడు డిశ్ఛార్జ్ అవుతారు ? అన్న విషయంలో ఇంకా క్లారిటీ లేదు. ఒకవేళ డిశ్చార్జ్ అయినా.. ఆ తర్వాత కనీసం 2 వారాలు రెస్ట్ తీసుకోమని వైద్యులు చెబుతారు. ఈ నేపథ్యంలో అక్టోబర్ లో రిపబ్లిక్ సినిమా వచ్చే అవకాశాలు చాలా తక్కువ. అస్సలు లేవనే చెప్పాలి.