బ్రేకింగ్ : చిన్నారి చైత్ర కుటుంబాన్ని కలవనున్న పవన్

హైదారాబాద్ లోని సైదాబాద్ సింగరేణి బస్తీలో ఆరేళ్ల చిన్నారి చైత్ర దారుణ హత్యకు గురైన సంగతి తెలిసిందే. ఈ ఘటన ప్రతీ ఒక్కరినీ కలచివేసింది. పరారీలో ఉన్న నిందితుడిని పట్టుకొని దారుణంగా శిక్షించాలి. ఉరిశిక్ష విధించాలని సామాన్య ప్రజలతో పాటుగా సినీ తారలు ముక్తకంఠంతో గళమెత్తుతున్నారు.

ఇప్పటికే మహేష్ బాబు, మంచు మనోజ్, నాని.. తదితరులు సోషల్ మీడియా వేదిక చిత్ర ఘటనపై స్పందించారు. ఆవేదన వ్యక్తం చేశారు. అయితే జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ చిత్ర కుటుంబ సభ్యులని కలవడానికి వెళ్తున్నారు. మరికొద్దిసేపట్లో పవన్ చైత్ర ఇంటికి చేరుకోనున్నట్టు తెలుస్తోంది. ఈ మేరకు జనసేన పార్టీ సోషల్ మీడియాలో గ్రూపులలో పోస్టులు వెలిశాయి.

ఇక చైత్ర నిందితుడుని పట్టుకొనేందుకు పోలీసులు గాలిస్తున్నారు. ఆ దేశదిమ్మరిని పట్టిస్తే.. రూ. 10లక్షల రిమాండ్ ఇస్తామని ఓ ప్రకటన కూడా విడుదల చేశారు. ‘6 సం’ చిన్నారి అత్యాచారం, హత్య” కేసులో నిందితుడిని (దేశదిమ్మరి), పట్టుకొనడంలో, #తెలంగాణాపోలీసులకు సమాచారం అందించి సహకరించండి. పట్టించిన వారికి రూ.10 లక్షల, నగదు బహుమతి ప్రకటించబడింది అంటూ ప్రకటన ఇచ్చారు. 

BREAKING

హైదరాబాదులోని సైదాబాద్ సింగరేణి బస్తీలో దారుణ హత్యకు గురైన ఆరేళ్ళ చిన్నారి చైత్ర కుటుంబాన్ని పరామర్శించడానికి వస్తున్న జనసేన అధినేత శ్రీ @PawanKalyan గారు

మరికొద్ది సేపట్లో జూబ్లీహిల్స్ కేంద్ర కార్యాలయం నుండి బయలుదేరనున్న జనసేనాని.#JusticeForChaithra— Trend PSPK (@TrendPSPK) September 15, 2021