కేటీఆర్ నిజంగానే మత్తులో ఉండి ట్వీట్ చేశారా ?

ఆరేళ్ల చిన్నారి చైత్ర దారుణ హత్య విషయంలో తెలంగాణ ప్రభుత్వ తీరు తీవ్ర విమర్శలకు దారి తీస్తుంది. ఈ ఘటనపై సీఎం కేసీఆర్ ఇప్పటి వరకు స్పందించలేదు. ఘటన జరిగింది హైదరాబాద్ లోనే. అనుకుంటే.. పది నిమిషాల్లో చైత్ర కుటుంబాన్ని సీఎం కేసీఆర్ పరామర్శించి రావొచ్చు. కానీ ఆ పని చేయలేదు. కనీసం చిన్నారి చైత్ర ఘటనపై సీఎం కేసీఆర్ దిగ్భ్రాంతి, సంతాపం అంటూ.. సీఎం కార్యాలయం నుంచి ఓ ప్రకటన రాలేదు. ఓ ట్విట్ చేయలేదు. ఇక మంత్రి కేటీఆర్ ట్విట్ మరీ దారుణం.

కాస్త ఆలస్యమైన ఈ నెల 12న చిన్నారి చైత్ర ఘటనపై మంత్రి కేటీఆర్ స్పందించారు. కొద్ది గంటల క్రిందటే నిందితుడిని అరెస్ట్ చేశాం. కఠినంగా శిక్షించాలని హోంమంత్రి, డీజీపీకి మంత్రి కేటీఆర్ ట్విట్ చేశారు. ఇప్పుడేమో.. నిందితుడు ఇంకా దొరకలేదు. పట్టించిన వారికి రూ.10 లక్షలు అంటూ పత్రికా ప్రకటన చేసింది. ఈరోజు రాత్రి వరకు నిందితుడిని అదుపులోని తీసుకుంటామని చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అంటున్నట్టుగా.. నిజంగానే మంత్రి కేటీఆర్ తాగి ట్విట్ చేశారా ? అన్ని ప్రజలు అడుతున్నారు. తన ట్విట్ కేటీఆర్ వివరణ ఇస్తే మంచిదని టీఆర్ఎస్ శ్రేణులు కూడా భావిస్తున్నాయి.

Deeply anguished with the news of a 6 year old child’s sexual molestation & murder in Singareni colony

While the perpetrator has been arrested within hours, I request Home Minister @mahmoodalitrs Garu & @TelanganaDGP Garu to ensure that justice is delivered expeditiously 🙏— KTR (@KTRTRS) September 12, 2021