TTD పాలకమండలి జాబితా విడుదల.. ఐదు రాష్ట్రాల వారికి చోటు !

తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) పాలకమండలి జాబితాను ఏపీ ప్రభుత్వం విడుదల చేసింది. మొత్తం 25 మందితో టీటీడీ పాలక మండలి జాబితాను ప్రభుత్వం ప్రకటించింది. ఈ పాలకమండలిలో ఏపీ నుంచి నలుగురు తెలంగాణ నుంచి నలుగురు, తమిళనాడు నుంచి ముగ్గురు, కర్ణాటక నుంచి ఇద్దరు, మహారాష్ట్ర నుంచి ఒకరు స్థానం దక్కించుకున్నారు. ఏపీతో కలిపి మొత్తం ఐదు రాష్ట్రాలు (ఏపీ, తెలంగాణ, తమిళనాడు, కర్నాటక, మహారాష్ట్ర) వారికి టీటీడీ పాలకమండలిలో స్థానం దక్కింది. ఇక ఎక్స్‌అఫిషియో సభ్యులుగా వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, భూమన కరుణాకర్‌రెడ్డి కొనసాగుతున్నారు.

టీటీడీ పాలక మండలి జాబితా :

ఏపీ : పోకల అశోక్ కుమార్, మల్లాడి క్రిష్ణారావు, వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి, గొర్ల బాబూరావు

తెలంగాణ : జూపల్లి రామేశ్వరావు, రాజే శర్మ, పార్థసారధి రెడ్డి, కల్వకుర్తి విద్యాసాగర్

తమిళనాడు : శ్రీనివాసన్, ఎమ్మెల్యే నందకుమార్, కన్నయ్య

కర్ణాటక : ఎమ్మెల్యే విశ్వనాధ్‌రెడ్డి, శశిధర్

మహారాష్ట్ర : శివసేనా కార్యదర్శి మిలింద్‍కు అవకాశం

ఇక పాలకమండలిలో పారిశ్రామిక వేత్త మైహోం రామేశ్వరరావు, హేటిరో పార్దసారధి రెడ్డి, మురంశెట్టి రాములు, వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి, ముంబాయికి చెందిన రాజేశ్ శర్మ, ఇండియా సిమెంట్స్ శ్రీనివాసన్ రెండోవసారి సభ్యత్వాన్ని దక్కించుకున్నారు.