‘రిపబ్లిక్’ రిలీజ్ డేటు మార్పు లేదు

దేవా కట్టా దర్శకత్వంలో సాయిధరమ్ తేజ్ నటించిన చిత్రం ‘రిపబ్లిక్’. భగవాన్ పుల్లారావు నిర్మించారు. అక్టోబర్ 1న విడుదల కావాల్సి ఉంది. ఇంతలో రోడ్డు ప్రమాదంలో సాయిధరమ్ తేజ్ గాయపడ్డారు. హాస్పటల్ లో చికిత్స పొందుతున్నారు. ఈ నేపథ్యంలో అక్టోబర్ 1న రిపబ్లిక్ రాకపోవచ్చు అనుకున్నారు. కానీ చిత్రబృందం ఆ డేటుకి విడుదల చేసేందుకు రెడీ అయింది.

జీటీవీ సంస్థ ఈ సినిమాకు మొదట్లోనే తీసేసుకుంది. ఆ సంస్థనే సినిమాను మార్కెట్ చేస్తోంది. ముందుగా అనుకున్న షెడ్యూలు ప్రకారమే అక్టోబర్ 1న సినిమాను విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. హీరో రాకున్నా.. డైరక్టర్, హీరోయిన్ అంతా పబ్లిసిటీలో పాలు పంచుకుంటారు. బుధవారం రమ్యకృష్ణ బర్త్ డే కానుకగా సినిమాలో ఆమె లుక్ ని రిలీజ్ చేశారు.