RRR తర్వాత రాజ‌మౌళి బాలీవుడ్ చిత్రం.. మహేష్ వెయిట్ చేయక తప్పదా ?

#RRR షూటింగ్ దాదాపు పూర్తయింది. కానీ కరోనా పూర్తిగా తగ్గని కారణంగా అక్టోబర్ 13న రావాల్సిన ‘ఆర్ఆర్ఆర్’ని వాయిదా వేశారు. త్వరలోనే కొత్త రిలీజ్ డేటుని ప్రకటించనున్నారు. ఇక ఆర్ఆర్ఆర్ కథానాయకుల తదుపరి సినిమాలు ఫిక్సయ్యాయి. కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ నెక్ట్స్ సినిమా (#Ntr30) ఉండనుంది. ఇక గ్రేట్ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ (#RC15) సినిమా ఉండనుంది. ఇప్పటికే అధికారిక ప్రకటనలు వచ్చేశాయి. త్వరలో సెట్స్ మీదకు వెళ్లనున్నాయి. అయితే రాజ‌మౌళి తదుపరి సినిమా ఏంటీ ? ఎవరితో ?? సూపర్ స్టార్ మహేష్ తోనేనా.. అంటే ? కాదట. జక్కన్న బాలీవుడ్ సినిమాని ప్లాన్ చేసుకుంటున్నారట.

మ‌హేష్ బాబుతో రాజ‌మౌళి సినిమా ఫిక్స‌యిపోయింది. అయితే… RRR కీ, మ‌హేష్ బాబు సినిమాకీ మ‌ధ్య‌లో రాజ‌మౌళి మ‌రో సినిమా చేసేస్తున్నాడ‌న్న‌ది అత్యంత విశ్వ‌స‌నీయ వ‌ర్గాల స‌మాచారం. అతి త‌క్కువ స‌మ‌యంలో, అతి త‌క్కువ బడ్జెలో ఓ ప్ర‌యోగాత్మ‌క సినిమా చేయాల‌న్న‌ది రాజ‌మౌళి ఆలోచ‌న‌. ఈ సినిమాని పూర్తిగా బాలీవుడ్ న‌టీన‌టులు, సాంకేతిక నిపుణ‌ల‌తో రూపొందించ‌నున్నాడ‌ట‌. కేవ‌లం నెల రోజుల్లో షూటింగ్ పూర్తి చేసి, మ‌రో నెల రోజుల్లో పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కి కేటాయించి, ఒక నెల ప్ర‌మోష‌న్లు గ‌ట్టిగా చేసి సినిమా విడుద‌ల చేయాల‌న్న ఆలోచ‌నలో రాజ‌మౌళి ఉన్నట్టు సమాచారమ్.