పంజాబ్‌ సీఎం రాజీనామా ?

పంజాబ్‌ సీఎం అమరీందర్‌ సింగ్‌ పదవికి రాజీనామా చేసే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఏ క్షణమైనా గవర్నర్‌కు రాజీనామా లేఖ అందించే అవకాశం ఉందని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. దీంతో ఈరోజు సాయంత్రం పంజాబ్‌ కాంగ్రెస్‌ శాసనసభాపక్షం సమావేశమై అమరీందర్‌ వారసుణ్ని ఎన్నుకోనున్నట్లు సమాచారం.

తాజా పరిణామాలతో విసిగిపోయానని సీఎం అమరీందర్‌ సింగ్‌ విసిగిపోయినట్లు తెలుస్తోంది. తన అసంతృప్తిని ఆయన నేరుగా పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ ముందు వ్యక్తం చేసినట్లు సమాచారం. సీఎం మార్పు జరుగుతోందంటూ గత కొంత కాలంగా వార్తలు రావడం తనకు అవమానకరంగా ఉందని సోనియా ముందు వాపోయినట్లు పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది. ఓ వర్గం తనపై కొన్ని నెలలుగా తిరుగుబాటుకు ప్రయత్నిస్తోందని ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఇక తాను పదవిలో కొనసాగలేనని తెలిపినట్లు తెలుస్తోంది.