నిలవాలంటే గెలవాలి

పీఎల్‌ 14వ సీజన్‌ తొలి భాగంలో కోల్‌కతా రెండు విజయాలే సాధించింది.  ఇప్పటివరకు ఆడిన ఏడు మ్యాచ్‌ల్లో ఐదింటిలో ఓటమి పాలై రెండు మ్యాచ్‌లే గెలిచింది. కరోనా ఉద్ధృతి కారణంగా టోర్నీ నిరవధిక వాయిదా పడేసమయానికి పాయింట్ల పట్టికలో ఏడో స్థానంలో నిలిచింది.

ఇప్పుడు ప్లేఆఫ్స్‌కు చేరాలంటే మిగిలిన అన్ని మ్యాచ్‌ల్లో గెలవాల్సిన పరిస్థితి. ఇక ఐపీఎల్ రెండో సీజన్ లో తొలి మ్యాచ్ లో ఈరోజు కేకేఆర్ ఆర్సీబీని ఢీకొట్టబోతుంది. సాయంత్రం 6గంటల నుంచి మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్ లో గెలిచి.. ప్లే ఆఫ్ ఆశలని సజీవంగా ఉంచుకోవాలని కేకేఆర్ భావిస్తుంది.