శాస్త్రి, మోడీ సేమ్ టు సేమ్.. ఆ ఒక్కటే తేడా !

విమానంలో ప్రయాణిస్తూ ఫైల్స్ చూస్తున్న అప్పటి భారత ప్రధాని లాల్ బహుదూర్ శాస్త్రి ఇప్పటికీ ఇంటర్నెట్‌లో విరివిగా సర్క్యూలేట్ అవుతూంటాయి. ఇప్పుడు శాస్త్రి ఫోటోలు ఇక పక్కకు పోవాల్సిందే. ఎందుకంటే అంతకు మించిన ఫోటోలు ప్రధాని నరేంద్రమోడీ రిలీజ్ చేశారు. 

ప్రస్తుతం నరేంద్రమోడీ అమెరికా పర్యటనకు వెళ్లారు. ప్రత్యేకంగా సిద్ధం చేయించుకున్న ఎయిర్ ఫోర్స్ వన్ తరహా విమానంలో మోడీ అమెరికా పయనమయ్యారు. ఈ సందర్భంలో ఆయన జర్నీలో ఖాళీగా ఉండలేదు.తనతో పాటు పరిశీలించాల్సిన ఫైళ్లను బ్యాగులో తీసుకెళ్లారు. విమానంలో కూర్చుని వాటిని పరిశీలించడం ప్రారంభించారు. దానికి సంబంధించిన ఫోటోని ప్రధాని సోషల్ మీడియాలో పెట్టారు. అప్పట్లో శాస్త్రి ఫోటో కన్నా ఇప్పుడు మోడీ ఫోటోనే వైరల్ అవుతుంది. ఆ ఫోటో ఈ ఫోటోకు ఒక్కటే తేడా ఉంటుంది. ఆ ఫోటోలో మాజీ ప్రధాని లాల్ బహుదూర్ శాస్త్రి భార్య ఉంటుంది. మోడీ పక్కసీట్లో కూడా ఫైల్స్ బ్యాగ్ ఉంటుంది. అంతే.. మిగతాది అంతా సేమ్ టు సేమ్.