‘పంతం’ ట్రైలర్ టాక్

కొత్త దర్శకుడు కె. చక్రవర్తి దర్శకత్వంలో యాక్షన్ హీరో గోపీచంద్ 25వ సినిమా ‘పంతం’ తెరకెక్కిన సంగతి తెలిసిందే. మెహ్రీన్ హీరోయిన్. జులై 5న ‘పంతం’ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పుడీ సినిమా ట్రైలర్ ప్రేక్షకుల ముందుకొచ్చేసింది. ఒకట్రెండు పవర్ ఫుల్ డైలాగ్స్, యాక్షన్ ని హైలైట్ గా చూపిస్తూ ట్రైలర్ ని కట్ చేశారు. గోపీచంద్ రెండు షేడ్స్ లో కనిపించాడు. ఇందులో ఒకటి క్లాస్, మరోటి గెడ్డెం లుక్ లో కనిపించాడు. ఐతే, ట్రైలర్ ఎఫెక్టివ్ గా లేదనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. రొటీన్ యాక్షన్ డ్రామాగా ట్రైలర్ ని చూస్తే అర్థమవుతోంది.

ఇటీవల కాలంలో గోపీచంద్ కు సరైన హిట్టు లేదు. ఆయన ఆశలనే ‘పంతం’ పైనే పెట్టుకొన్నాడు. ఈ సినిమా కోసం కొత్త దర్శకుడు కె. చక్రవర్తిని ఎంచుకొని సాహాసం చేశాడనే కామెంట్స్ వినిపించాయి. ఇప్పుడని నిజమయ్యేలా ఉందని ట్రైలర్ టాక్ ని చూస్తే అర్థమవుతోంది. ఐతే, ట్రైలర్ ని చూసి సినిమా ఫలితాన్ని చెప్పలేం. కాకపోతే ట్రైలర్ టాక్ ప్రేక్షకులని థియేటర్స్ కి రప్పించగలదు. పంతం పై పాజిటివ్ పబ్లిక్ టాక్ కోసం మరో ట్రైలర్ ని వదలాల్సి వస్తుందేమో.