గుడ్ న్యూస్ : కరోనా తగ్గుతోంది.. 20వేల లోపు కేసులు, 200లోపు మరణాలు

దేశంలో క్రమంగా కరోనా తీవ్రత తగ్గుతోంది. రోజుగా వారీగా నమోదవుతున్న కొత్త కేసులు, మరణాల సంఖ్యలో భారీ తగ్గుదల కనిపిస్తున్నది. తాజాగా కొత్త కేసులు 20వేల లోపే నమోదుకావడం ఊరట కలిగిస్తోంది. ఇక మరణాలు కూడా 200లోపే ఉన్నాయి.

గడిచిన 24 గంటల్లో దేశ్ంలో 18,795 కొత్త కేసులు నమోదయ్యాయి. 179 మంది కరోనాతో మృతి చెందారు. దీంతో ఇప్పటి వరకూ ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 4,47,373గా ఉంది. కొత్త కేసుల కంటే రికవరీలు ఎక్కువగా ఉండటం గుడ్ న్యూస్ అని చెప్పవచ్చు. తాజాగా 26,030 మంది కొవిడ్‌ను జయించగా.. ఇప్పటి వరకూ కోలుకున్నవారి సంఖ్య 32,9,58,002(97.81%)కి చేరింది. ప్రస్తుతం క్రియాశీల కేసులు 292206(0.87%) ఉన్నాయి.