హమ్మయ్యా.. హైదరాబాద్ గెలిచింది !

ఎనిమిది పరాజయాలతో ఇప్పటికే ప్లేఆఫ్స్‌ రేసు నుంచి నిష్క్రమించిన సన్‌రైజర్స్‌ అదరగొట్టింది. ఐపీఎల్‌-14లో అయిదు ఓటముల తర్వాత విజయాన్ని అందుకుంది. ఆల్‌రౌండ్‌ ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తూ రాజస్థాన్‌ను ఓడించింది.

కెప్టెన్‌ సంజు శాంసన్‌ (82 నాటౌట్‌; 57 బంతుల్లో 7×4, 3×6) రాణించడంతో మొదట రాజస్థాన్‌ 5 వికెట్లకు 164 పరుగులు చేసింది. సిద్ధార్థ్‌ కౌల్‌ (2/36), భువనేశ్వర్‌ (1/28), రషీద్‌ ఖాన్‌ (1/31) ఆ జట్టును కట్టడి చేశారు. జేసన్‌ రాయ్‌తో పాటు కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌ (51 నాటౌట్‌; 41 బంతుల్లో 5×4, 1×6) రాణించడంతో లక్ష్యాన్ని సన్‌రైజర్స్‌ ఓవర్లలో 18.3 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఈ ఐపీఎల్‌లో సన్‌రైజర్స్‌కు ఇది రెండో విజయం మాత్రమే.