అశ్విన్ చేసిన నీచపు పని

టీమిండియా స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ గతంలో చేసిన ఓ నీచపు పనిని మాజీ మాజీ క్రికెటర్‌ వీరేంద్ర సెహ్వాగ్‌ బయటపెట్టారు. ఇటీవల ఢిల్లీ, కోల్‌కతా జట్ల మధ్య జరిగిన ఓ మ్యాచ్‌లో అశ్విన్‌, మోర్గాన్‌ మధ్య ఓ వివాదం చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. రాహుల్‌ త్రిపాఠి విసిరిన త్రో.. పంత్‌కు తగిలి బంతి దూరంగా వెళ్లడంతో దిల్లీ బ్యాట్స్‌మెన్‌ ఒక పరుగు తీశారు. దీనిపై కోల్‌కతా కెప్టెన్‌ ఇయాన్‌ మోర్గాన్‌ ఆగ్రహం వ్యక్తం చేశాడు. వెంటనే అశ్విన్‌ ఔటయ్యాక ఇద్దరి మధ్య మాటల తూటాలు పేలాయి. దినేశ్‌ కార్తీక్‌ కలగజేసుకొని ఇద్దర్నీ వేరు చేశాడు. 

ఈ విషయంపైనే సెహ్వాగ్‌ ఓ క్రీడాఛానల్‌తో మాట్లాడారు. మైదానంలో జరిగే విషయాలు అక్కడితో వదిలేయాలని, వాటిని బయటకు తీసుకురావొద్దు. ‘2014లో నేను, గ్లెన్‌ మాక్స్‌వెల్‌ పంజాబ్‌ జట్టుకు ఆడేటప్పుడు.. అశ్విన్‌ చెన్నైకు ప్రాతినిధ్యం వహించాడు. అప్పుడు ఒక మ్యాచ్‌లో మాక్స్‌వెల్‌ను అతడు ఔట్‌ చేశాక దుమ్మెత్తి ఊదాడు. అది మరో ఎండ్‌లో ఉన్న నాకూ నచ్చలేదు. అశ్విన్‌ అలా చేయడం ద్వారా చెన్నై కెప్టెన్‌ ధోనీకి కూడా కోపం వచ్చింది. వెంటనే మహీ.. అశ్విన్‌ను మందలించాడు. ఈ విషయాన్ని నేను అక్కడితోనే వదిలేశాను. దాన్ని మీడియా ముందు లేదా సోషల్‌ మీడియాలో ఎక్కడా ప్రస్తావించలేదు. అది తప్పో, ఒప్పో లేక క్రీడాస్ఫూర్తికి విరుద్ధమో పట్టించుకోలేదు. ఆ విషయాన్ని బయటికి చెప్పి ఉంటే.. పెద్ద వివాదాస్పదమయ్యేది. మైదానంలో ఏం జరిగినా అది ఆటగాళ్ల మధ్యే ఉండాలి. బయటకు రాకూడదు. అది వాళ్ల బాధ్యత అని వీరూ వివరించాడు.