టాప్‌ లేపిన దిల్లీ క్యాపిటల్స్‌

చెన్నైని ఢిల్లీ ఓడించింది. పదో విజయంతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి దూసుకెళ్లింది. సోమవారం ఉత్కంఠభరితంగా జరిగిన మ్యాచ్‌లో దిల్లీ 3 వికెట్ల తేడాతో చెన్నైపై విజయం సాధించింది. రాయుడు (55 నాటౌట్‌; 43 బంతుల్లో 5×4, 2×6) పోరాడడంతో మొదట చెన్నై 5 వికెట్లకు 136 పరుగులు చేసింది. అక్షర్‌ పటేల్‌ (2/18), అశ్విన్‌ (1/20) చెన్నైకి కళ్లెం వేశారు.నార్జ్‌, అవేష్‌ ఖాన్‌ చెరో వికెట్‌ పడగొట్టారు. రబాడ 4 ఓవర్లలో 21 పరుగులే ఇచ్చాడు.

అనంతరం 137 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ..  ధావన్‌ (39; 35 బంతుల్లో 3×4, 2×6), హెట్‌మయర్‌ (28 నాటౌట్‌; 18 బంతుల్లో 2×4, 1×6) రాణించడంతో లక్ష్యాన్ని 19.4 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి ఛేదించింది. శార్దూల్‌ (2/13), జడేజా (2/28) గొప్పగా బౌలింగ్‌ చేసినా ఫలితం లేకపోయింది.