ఓబులమ్మ.. సైజులు తగ్గించలేదట !

కొండపొలం.. మినీ జంగిల్ బుక్ లాంటిది అన్నారు హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్. క్రిష్ దర్శకత్వంలో రకుల్-వైష్ణవ్ తేజ్ జంటగా నటించిన చిత్రమిది. కరోనా లాక్ డౌన్ టైమ్ లో వికారాబాద్ అడవుల్లో ఈ చిత్రాన్ని చిత్రీకరించారు. ఇందులో పల్లెటూరి యువతి ఓబులమ్మగా సరికొత్త పాత్రలో నటిస్తోంది. అక్టోబర్ 8న ‘కొండపొలం’ థియేటర్లలో విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలో సినిమా ప్రమోషన్స్ లో పాల్గొన్న రకుల్.. సినిమా, పర్సనల్ విషయాలని పంచుకున్నారు.

‘కొండపొలం’లో నాది భిన్నమైన పాత్ర. గొర్రెలు కాసే అమ్మాయిగా కనిపిస్తా. నన్ను నమ్మి ఓబులమ్మ పాత్ర ఇచ్చినందుకు క్రిష్‌కి థ్యాంక్స్. ‘కొండపొలం’ సినిమా కోసం నేనేమీ బరువు తగ్గలేదు. క్రిష్ కథ చెప్పేందుకు ఇంటికి వచ్చినప్పుడు.. ‘చాలా యంగ్‌గా ఉన్నావ్.. నాకు కావాల్సింది ఇదే’ అంటూ సంతోషం వ్యక్తం చేశారు. సినిమా కథ చాలా నచ్చింది. ఇంత వరకూ భారతీయ సినీ చరిత్రలో ఇలాంటిది చిత్రం రాలేదు. అందుకే కథ విన్న వెంటనే ఓకే చెప్పేశాను. మినీ జంగిల్ బుక్ లాంటి చిత్రమిదని చెప్పుకొచ్చింది.

కరణం మల్లీశ్వరీ చేయడం లేదు :
కరణం మల్లీశ్వరీ  సినిమా చేస్తున్నాను అని వచ్చిన వార్తల్లో వాస్తవం లేదు. ఇప్పుడు బాలీవుడ్ ప్రాజెక్ట్ లతో బిజీ. ప్రస్తుతం ముంబయిలోనే ఉంటున్నాను. వచ్చే ఏడాది ఆరు చిత్రాలు విడుదదల కాబోతోన్నాయి. వాటి ఫలితమెలా ఉంటుందో చూడాలి. జీవితాంతం ప్రేక్షకులు గుర్తు పెట్టుకొనే సినిమాలు చేయాలని ఉంది. ఓటీటీ ఆఫర్లు వస్తున్నాయి. కానీ ఇప్పటి వరకు ఏ ఒక్కటి ఓకే చేయలేదని చెప్పుకొచ్చింది రకుల్.