ప్రియుడు లేడు.. ఇంకా సింగిల్ గానే.. వాళ్లంటే ఇష్టం !

రాశీఖన్నా – దక్షిణాదిలో వరుస ప్రాజెక్ట్‌లు చేస్తూ బిజీగా గడుపుతోంది. ప్రస్తుతం మలయాళంలో పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ సరసన నటిస్తుంది రాశీ. తాజాగా ఆమె  ఇన్‌స్టా వేదికగా అభిమానులతో చిట్‌చాట్‌ చేశారు. ఇందులో భాగంగా పర్సనల్, సినిమాలకు సంబంధించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు ముద్దుగుమ్మ. 

ఇంకా నా జీవితంలోకి బాయ్‌ఫ్రెండ్ రాలేదు. ఒకవేళ నేను ఎవరినైనా ఇష్టపడితే తప్పకుండా మీ అందరికీ చెబుతాను. కాబట్టి ఇంకొంతకాలం ఆగండని చెప్పింది. కోలీవుడ్‌లో విజయ్‌, నయనతార అంటే ఇష్టం. మలయాళంలో ఫహద్‌ ఫాజిల్‌ అంటే ఇష్టం. విజయ్ దేవరకొండ ఎంతో టాలెంట్‌ ఉన్న నటుడు. ఆయనతో కలిసి మరోసారి నటించాలని ఉంది.

టాలీవుడ్‌లో సమంత, అనుష్క శెట్టి, జూనియర్‌ ఎన్టీఆర్‌, బన్నీ, మహేశ్‌బాబు అంటే ఇష్టం. అలాగే, వెంకటేశ్‌ అంటే నాకెంతో ఇష్టం. ఆయన చాలా బాగా మాట్లాడతారు. కలిసిపోతారు. నా చేతిలో వరుస ప్రాజెక్ట్‌లు ఉన్నాయి. మరో రెండు రోజుల్లో అమెజాన్‌ ప్రైమ్‌ వేదికగా ‘బ్రహ్మాం’ విడుదల కానుందని చెప్పుకొచ్చింది. మీరింకా సింగిల్‌గానే ఎలా ఉన్నారు? అని ఓ నెటిజన్ ప్రశ్నించగా.. ఏమో నాకు తెలీదు అంటూ నవ్వేసింది.