నాలుగున్నర లక్షలకు చేరిన కరోనా మరణాలు

దేశంలో కరోనా కేసులు తగ్గినట్టే తగ్గి.. పెరుగుతున్నాయి. అయితే క్రియాశీల కేసులు గణనీయంగా తగ్గుతుండటం ఊరటనిస్తోంది. ఆ సంఖ్య 205 రోజుల కనిష్ఠానికి చేరింది.  గడిచిన 24 గంటల్లో దేశంలో 21,257 మందికి పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. అంతక్రితం రోజుతో పోల్చితే కేసులు స్వల్పంగా తగ్గాయి.

271 మంది ప్రాణాలు కోల్పోయారు. దాంతో మొత్తం కేసులు 3.39 కోట్లకు చేరగా.. 4,50,127 మంది ప్రాణాలు కోల్పోయారు. దేశంలో 2,40,221 మంది కొవిడ్‌తో బాధపడుతున్నారు. క్రియాశీల రేటు 0.71 శాతానికి తగ్గింది. రికవరీ రేటు కూడా మెరుగ్గా ఉంది. నిన్న 24,963 మంది కోలుకున్నారు. మొత్తం రికవరీలు 3.32 కోట్ల(97.96 శాతం) మార్కును దాటాయి.