ఆ మజానే వేరు

ఈ ఏడాది ఆరంభంలో ‘క్రాక్‌’తో హిట్ కొట్టింది శృతిహాసన్.. ఆమె ప్రస్తుతం పాన్‌ ఇండియా చిత్రం ‘సలార్‌’లో ప్రభాస్‌ సరసన నటిస్తోంది. ఈ చిత్రం గురించి శ్రుతి మాట్లాడుతూ ”సలార్‌’ లాంటి చిత్రాల్లో నటించే అవకాశం నన్ను అన్ని భాషలవారికి దగ్గర చేస్తుందని చెప్పుకొచ్చింది. ఇక థియేటర్, ఓటీటీలలో దేనికి మీ ఓటు అని అడిగితే.. కచ్చితంగా థియేటర్‌కే అని టక్కున చెప్పేసింది.

దానికి సమానమైన అనుభూతి ఎందులోనూ రాదు. దానికి ఏదీ పోటీయే కాదు. ఎలాంటి ఇబ్బంది, గోల లేకుండా చూసే సినిమాలు మాత్రమే ఓటీటీలో చూడగలం. చాలా సినిమాలు థియేటర్‌లోనే చూడాలి. ఈలలు, గోల మధ్య చూస్తేనే ఆ మజా ఉంటుందని శృతి చెప్పుకొచ్చింది.