భారీగా తగ్గిన కరోనా కేసులు.. 230 రోజుల కనిష్టానికి !

దేశంలో కరోనా తగ్గుముఖం పడుతోంది. కొత్త కేసులు మరింత తగ్గాయి. 230 రోజుల కనిష్ఠానికి చేరి ఊరటనిస్తున్నాయి.  క్రియాశీల కేసులు రెండు లక్షల దిగువకు, మరణాలు 200లోపు నమోదయ్యాయి. ఆదివారం 13,596 మందికి పాజిటివ్‌గా తేలింది. ముందురోజు ఏడు నెలల కనిష్ఠానికి పడిపోయిన కేసులు.. తాజాగా మరింత తగ్గాయి. నిన్న 19,582 మంది కరోనా నుంచి కోలుకున్నారు.

ఇప్పటివరకు 3.40 కోట్ల మంది మహమ్మారి బారిన పడగా.. 3.34 కోట్ల మంది వైరస్‌ను జయించారు. ప్రస్తుతం క్రియాశీల రేటు 0.56 శాతానికి తగ్గగా.. రికవరీ రేటు 98.12 శాతానికి పెరిగింది. నిన్న 166 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటివరకు 4,52,290 మంది మృత్యుఒడికి చేరుకున్నారు.