రాధేశ్యామ్ టీజర్ డేటు వచ్చేసింది

ప్రభాస్‌-పూజాహెగ్డే ప్రధాన పాత్రల్లో నటిస్తున్న అపురూప ప్రేమకావ్యం ‘రాధేశ్యామ్‌’. రాధాకృష్ణ దర్శకత్వం వహించారు. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా ఈ సినిమా టీజర్ డేటుని చిత్రబృందం ప్రకటించింది. ఈ నెల 23 ఉదయం 11:16 గంటలకు టీజర్ ని విడుదల చేయనున్నట్టు చిత్రబృందం ప్రకటించింది. ఇదో ప్రేమకథ చిత్రం. ఇటలీ నేపథ్యంలో పునర్జన్మల కథగా తెరక్కెకుతోంది.

సాహో తర్వాత రాధేశ్యామ్ చిత్రాన్ని ప్రభాస్ సెట్స్ మీదకు తీసుకెళ్లారు. కరోనా ఎఫెక్ట్ తో షూటింగ్ లో  జాప్యం జరిగింది. రాధేశ్యామ్ సెట్స్ మీద ఉండగానే మరో మూడు సినిమాలని (సలార్, ఆదిపురుష్, నాగ్ అశ్విన్) ప్రకటించారు ప్రభాస్. వీటిలో సలార్, ఆదిపురుష్ చిత్రాలు షూటింగ్ జరుపుకుంటున్నాయి. త్వరలోనే నాగ్ అశ్విన్ సినిమా రెగ్యూలర్ షూటింగ్ కూడా ప్రారంభం కానుంది. ఇవీగాక.. అర్జున్ రెడ్డి దర్శకుడు సందీప్ రెడ్డి వంగా చెప్పిన కథకు ప్రభాస్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు.