విషాదం : పర్వతారోహణకు వెళ్లి 12 మంది మృతి

ఉత్తరాఖండ్‌లో మరో విషాదం చోటుచేసుకుంది. మంచు చరియలు విరిగిపడి 12 మంది పర్వతారోహకులు దుర్మరణం చెందారు. మరికొందరు గల్లంతయ్యారు. ఉత్తరాఖండ్‌, హిమాచల్‌ప్రదేశ్‌ మధ్య ఉండే హార్సిల్‌-చిట్కుల్‌ ట్రెక్‌ రూట్‌లో పర్వతారోహణకు వెళ్లిన 11 మంది బెంగాలీ ట్రెక్కర్లు మంచు చరియలు విరిగిపడి గల్లంతయ్యారు. 

వాయుసేన సాయంతో పర్వతాలపై గాలింపు చేపట్టారు. దాదాపు 17వేల అడుగుల ఎత్తులో ఈ ప్రమాదం చోటుచేసుకోగా.. హెలికాప్టర్‌ సాయంతో రెస్క్యూ ఆపరేషన్‌ చేపట్టారు. వీరిలో ఏడుగురి మృతదేహాలను సహాయక సిబ్బంది గుర్తించారు. ఇద్దరిని కాపాడగా.. మరో ఇద్దరు గల్లంతయ్యారు. కాపాడిన వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు.