పూరి ఏడ్చేశాడు

ఏడిస్తే వీకైపోతాం అంటాడు దర్శకుడు పూరి జగన్నాథ్. నా జీవితంలో ఏడుపు అనేది తెలీదు అని ఓ ఇంటర్వ్యూలో పూరి చెప్పారు. కోట్ల రూపాయలు పోగొట్టుకొని తను, తన కుటుంబం రోడ్డు మీద పడ్డా.. చుక్కు కన్నీరు కార్చలేదు. కుంగిపోలేదు పూరి. గోడకు తగిలిన బంతిలా.. మళ్లీ పైకొచ్చాడు. సినిమాలు ప్లాప్ అయినప్పుడూ అంతే. ఇక పూరి పనైపోయింది అనే మాటలు వినిపిస్తున్న టైమ్ లో ‘ఇస్మార్ట్ శంకర్’ తో అసలు సిసలు మాస్ సినిమా అంటే ఎలా ఉంటుందో చూపించాడు. బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు. బౌన్స్ బ్యాక్ అయ్యాడు. అలాంటి పూరి కొడుకు సినిమా రొమాంటిక్ చూసి ఏడ్చేశారట. ఎడిట్ రూమ్ లో ఈ సినిమా చూశాక‌.. ఏడ్చేశాడ‌ట‌. ఈ విష‌యాన్ని రొమాంటిక్‌ ద‌ర్శ‌కుడు అనిల్ పాడూరి తెలిపారు.

”ఎడిట్ రూమ్ లో ఈ సినిమా చూసి పూరిసార్ ఏడ్చేశారు. ‘అమ్మానాన్న త‌మిళ అమ్మాయి’తో ఈ సినిమాని పోల్చారు. అమ్మా నాన్న సినిమాని నేను చాలా ఎమోష‌న‌ల్ గా తీశాను. ఈ సినిమాని కూడా నువ్వు అలానే తీశావ్‌’ అని మెచ్చుకున్నారు. పూరి ఇచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ అదే” అని చెప్పుకొచ్చాడు అనిల్. ఈవారంలోనేరొమాంటిక్‌` విడుద‌ల అవుతున్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమాకి పూరి ద‌ర్శ‌కుడు కాక‌పోయినా, క‌థ‌, మాట‌లు, స్క్రీన్ ప్లే అందించి, నిర్మాణ బాధ్య‌త‌లూ స్వీక‌రించాడు. దాంతో ఇది పూరి సినిమాగానే చాలామ‌ణీ అవుతోంది.