పూనమ్ కౌర్ మళ్లీ కెలికింది

పూనమ్ కౌర్ – హీరోయిన్ గా కంటే పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తో లింకు ఉందనే ప్రచారంతోనే ఎక్కువగా పాపులర్ అయింది. ఈవిడ సోషల్ మీడియా వేదికగా సంచలన కామెంట్స్ చేస్తుంటుంది. ఓ సారి ప్రేమని కురిపిస్తుంటుంది. మరోసారి ద్వేశాన్ని చూపిస్తుంటుంది. ఇంకోసారి ప్రశ్నిస్తుంటుంది, ప్రస్టేషన్ చూపిస్తుంటుంది. ఇలా ఆమె ఏం చేసినా.. అది పవన్ కల్యాణ్ ని దృష్టిలో ఉంచుకొనే ప్రచారం మాత్రం ఉంది. ఎందుకలా అంటే.. ? పవన్ తో పూనమ్ కు బలమైన బంధం ఏర్పడింది. ఆమె ఏకంగా పవన్ భార్య స్థానంలో ఉండాల్సి ఉంది. కానీ అదృష్టం కలిసిరాక, ఓ టాప్ దర్శకుడు, పవన్ స్నేహితుడి అడ్డుకోవడం వలన అది జరగలేదని కథలు కథలుగా చెప్పుకుంటారు. ఈ విషయం పక్కనపెడితే.. తాజాగా పూనమ్ షాకింగ్ ట్వీట్  ఒకటి చేసింది. ఈసారి విడాకులపై ఆమె బాధని వెల్లగక్కింది. అందులో తప్పేంలేదు. కానీ.. ట్విట్ చేసిన కొద్దిసేపటికే దానిని డిలీట్ చేసేయడం హాట్ టాపిక్ గా మారింది.


విడాకుల త‌ర్వాత పురుషుల‌కు బాధ ఉండదా? అని పూనమ్ సూటిగా ప్ర‌శ్నించింది. విడాకులు తీసుకున్న మ‌హిళలనే స‌మాజంలో ఇబ్బందులు పెడతారని, వారిని మాటలతో బాధిస్తారని రాసుకొచ్చింది. మ‌హిళ‌ల‌ వల్లే పురుషుల‌కు ఇబ్బందిక‌ర పరిస్థితులు వస్తుంటాయని సమాజం అంటుంద‌ని చెప్పింది. ఇప్పటికి కూడా మనం విడాకుల అంశాన్ని పూర్తి స్థాయిలో అర్థం చేసుకోగలిగామా? అని ప్ర‌శ్నించింది. విడాకుల  విష‌యంలో మనకు కచ్చితమైన దృక్కోణం ఉందా ? అని ఆమె అడిగింది. పూనమ్ ఏం చేసినా.. అవి పవన్ ను ఉద్దేశించే అనే ప్రచారం ఉండనే ఉంది. తాజా ట్విట్ కూడా ఆయన్ని దృష్టిలో ఉంచుకొనే కాబోలు అనుకొనే లోపు.. ఆ ట్వీట్ ని పూనమ్ డిలీట్ చేసింది. అయితే ఈలోపే కొందరు నెటిజన్స్ ఆమె ట్వీట్ ని స్కీన్ షాట్స్ తీసేశారు. దాన్ని ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ చేసేస్తున్నారు.