మాస్ డైరెక్టర్ కె.ఎస్ నాగేశ్వరరావు ఇకలేరు

టాలీవుడ్ లో విషాదం చోటు చేసుకుంది. నటుడు, దర్శకుడు కె. ఎస్ నాగేశ్వరరావు కన్నుమూశారు. గత కొంతకాలంగా ఆయన కిడ్నీ సంభందించిన వ్యాధితో బాధపడుతూ చికిత్స పొందుతున్నారు.. నిన్న (నవంబర్ 26) ఏలూరు నుండి తిరిగి వస్తూ.. ఫిట్స్ వచ్చి అకస్మాత్ గా కుప్పకూలిపోయారు.. వెంటనే ఆయన్ను దగ్గరలో వున్న హాస్పటల్ తరలించారు. హాస్పటల్ లో చికిత్స పొందుతూ ఆయన నిన్న సాయంత్రం మృతి చెందారు.. ఇవాళ ఆయన స్వస్థలం అయిన కోయిలగుడేం దగ్గరలో వున్న పోతవరంలో ఈరోజు అంత్యక్రియలు జరిగాయి.

క్యారెక్టర్ ఆర్టిస్టు గా, విలన్ గా అంచెలంచెలుగా ఎదుగుతూ ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు సంపాదించుకున్న కె. ఎస్ నాగేశ్వరరావు ఆ తర్వాత దర్శకుడిగా మారాడు. శ్రీహరి ని హీరోగా పరిచయం చేసింది ఇతనే. పోలీస్, దేవా, సాంబయ్య చిత్రాలను రూపొందించి శ్రీహరికి హ్యాట్రిక్ హిట్స్ ఇచ్చాడు. ఆతర్వాత శ్రీశైలం, లేడీ సూపర్ స్టార్ విజయశాంతి తో వైజయంతి చిత్రాలను రూపొందించి మాస్ డైరెక్టర్ గా పేరు సంపాదించుకున్నారు.