పవన్-సురేందర్ రెడ్డి.. బిజినెస్ క్లోజ్ !

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటిస్తున్న రెండు సినిమాలు ప్రస్తుతం సెట్స్ మీద ఉన్నాయి. ఇందులో ఒక్కటి ‘భీమ్లా నాయక్’ కాగా రెండోది హరిహర వీరమల్లు. ఈ రెండు సినిమాల శాటిలైట్ రైట్స్, నాన్ థియేట్రికల్ రైట్స్ ఇంకా అమ్ముడుపోలేదు. అయితే ఇంకా సెట్స్ పైకి తీసుకురాని పవన్-సురేందర్ రెడ్డి సినిమా బిజినెస్ మాత్రం క్లోజ్ చేసింది.

ఈ సినిమాను జీ గ్రూప్ దక్కించుకుంది. ఈ సినిమాకు సంబంధించి శాటిలైట్, డిజిటల్ రైట్స్ తో పాటు మరికొన్ని నాన్-థియేట్రికల్ రైట్స్ ను జీ గ్రూప్ దక్కించుకుంది. దీంతో పాటు ఈ ప్రాజెక్టుకు సహ-నిర్మాతగా కూడా వ్యవహరించబోతోంది ఈ సంస్థ.