అడవి తల్లి మాట.. వచ్చేసింది.

సాగర్‌ కె.చంద్ర దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ పవన్‌కల్యాణ్‌, రానా కథానాయకులుగా నటిస్తున్న చిత్రం  ‘భీమ్లానాయక్‌’. ఇప్పటికే ఈ చిత్రానికి సంబందించిన మూడు పాటలు విడుదలయ్యాయి. తాజాగ  ఇందులోని  అడవి తల్లి మాట… అంటూ సాగే నాలుగో పాటని శనివారం విడుదల చేశారు. ఈ చిత్రానికి త్రివిక్రమ్‌ రచన చేయగా, తమన్‌ సంగీతం అందించారు.

మలయాళంలో ఘన విజయం సాధించిన ‘అయ్యప్పనుమ్‌ కోషియుమ్‌’ చిత్రానికి రీమేక్‌గా ఈ చిత్రం తెరకెక్కుతోంది. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై సూర్యదేవర నాగవంశీ ఈచిత్రాన్ని నిర్మిస్తున్నారు. వచ్చే నెల జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రానుంది ఈ చిత్రం.