కోహ్లీ కెప్టెన్సీ పీకెయ్యడంపై గంగూలీ కామెంట్స్

టీ20 కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకుంటున్న విరాట్ కోహ్లీ స్వతహా ప్రకటించారు. అయితే వన్డే కెప్టెన్ బాధ్యతలను నుంచి ఆయన్ని బీసీసీఐ తొలగించిన సంగతి తెలిసిందే. తాజాగా దీనిపై బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ స్పందించారు. తెల్లబంతి ఫార్మాట్‌కు ఒకే కెప్టెన్‌ ఉండాలనుకున్నారు. అందుకే ఈ నిర్ణయం తీసుకొన్నారు. భవిష్యత్తులో ఏం జరుగుతుందో నాకు తెలియదని దాదా అన్నారు. 


అయితే టీ20 ఫార్మాట్‌ కెప్టెన్సీని వదిలేయవద్దని తాను వ్యక్తిగతంగా విరాట్‌ ను కోరానని దాదా అన్నారు. కానీ.. ఆ బాధ్యతలను అతను భారంగా భావించాడు. అలా అనుకోవడం మంచిదే. అతడో అద్భుతమైన క్రికెటర్‌. ఆటతో మమేకమై ఉంటాడు. అతడు చాలా రోజుల పాటు కెప్టెన్సీ బాధ్యతలు నిర్వహించాక ఈ నిర్ణయానికి వచ్చాడు. నేను కూడా చాలా రోజులు కెప్టెన్‌గా బాధ్యతలు నిర్వహించాను. అందుకే నాకు ఆ కారణం తెలుసు అన్నారు.