ఆహా.. మరో బ్యానర్ !

అల్లు ఫ్యామిలీకి ఇప్పటికే రెండు నిర్మాణ సంస్థలు ఉన్నాయి. గీతా ఆర్ట్స్, గీతాఆర్ట్స్ 2 బ్యానర్స్ మీద సినిమాలు నిర్మిస్తున్నారు. ‘ఆహా’ పేరుతో ఓటీటీ వేదికగా కూడా ఉంది. తెలుగులో వచ్చిన తొలి ఓటీటీ ఫ్లాట్ ఫామ్ ఇది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఆధ్వర్యంలోనే ఆహా కోసం వెబ్ సిరీస్ లు, డిఫరెంట్ కాన్సెప్ట్ మూవీస్ కోసం కసరత్తులు జరుగుతున్నాయి. ఇందుకోసం టాప్ డైరెక్టర్స్ ని రంగంలోకి దించుతున్నారు. ఐతే అది ఏమాత్రం చాలట్లేదు. ఇప్పుడు ఆహా నుంచి సరికొత్త బ్యానర్ వచ్చింది.

‘ఆహా స్టూడియోస్’ పేరుతో కొత్త నిర్మాణ సంస్థను ప్రకటించిన అల్లు అరవింద్.. ఈ బ్యానర్ మీద తొలి ప్రాజెక్ట్ గా మాజీ ప్రధాని పీవీ నరసింహారావు బయోపిక్ ని ప్రకటించారు. ఇది పాన్ ఇండియా వెబ్ సిరీస్ గా తెలుగు, హిందీ, తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో ఈ వెబ్ సిరీస్ ని తీసుకురానున్నారు. జాతీయ అవార్డు విజేత ప్రకాష్ ఝా ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. మొత్తానికి.. అల్లు ఫ్యామిలీ బ్యానర్ల సంఖ్య మూడుకు చేరింది. ఆహా ఓటీటీ వీటికి అదనం.