షూటింగ్ నుంచి పారిపోయిన హీరోయిన్.. వాడితో జంప్ !

కోలీవుడ్ హీరోయిన్ మీరా మిథున్‌ షూటింగ్ నుంచి పారిపోవడం హాట్ టాపిక్ గా మారింది. టీవీ షోలతో పాపులర్ అయిన ఈ బ్యూటీకి సినిమా ఆఫర్లు వస్తున్నయి. ప్రస్తుతం ‘పేయి కానోమ్’ అనే సినిమా చేస్తుంది. సెల్వ అన్భరసన్‌ అనే కొత్త దర్శకుడు తెరకెక్కిస్తున్నాడు. గ్లోబల్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్ పై తేని భారత్‌ ఆర్‌.సురుళివేల్‌ నిర్మిస్తున్నారు.

ఈ సినిమా  80 శాతం పూర్తయిన తర్వాత హీరోయిన్ మీరా మిథున్‌ పోలీసులు అరెస్ట్ చేశారు. దానికి ఏవో కారణాలు ఉన్నాయి. ఆమె జైలు నుంచి విడుదల అయిన తర్వాత మిగిలిన 20 శాతం షూటింగ్ ని పూర్తి చేసే పనిలో పడింది చిత్రబృందం. అయితే షూటింగ్ మరో రెండ్రోజుల్లో మిగిలివున్న టైమ్ లో మీరా మిథున్ ఎవరికీ చెప్పకుండా పారిపోయింది. ఎవరితో వెళ్లింది. ఎక్కడికి వెళ్లింది అనే వివరాలేవీ తెలీయదు. ఆమె వచ్చిన ఆరుగురితో జంప్ అయింది. దీంతో చేసేదేమీ లేక కథలో మార్పులు చేసి… షూటింగ్ పూర్తి చేశామని దర్శకుడు చెప్పారు.