తగ్గేదేలే.. ‘4రోజుల్లో రూ. 203కోట్లు’.. పుష్ప కలెక్షన్ల సునామీ

బాక్సాఫీస్ దగ్గర పుష్పరాజ్ అదరగొడుతున్నాడు. పుష్ప కలెక్షన్స్ రూ. 200కోట్లు దాటేశాయి. కేవలం నాలుగు రోజుల్లో రూ. 203కోట్ల గ్రాస్ ని రాబట్టినట్టు చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. మంగళవారం తిరుపతిలో పుష్ప సక్సెస్ మీట్ జరిగింది. ఈ వేదికగా పుష్ప నాలుగురోజుల కలెక్షన్స్ పై చిత్రబృందం ప్రకటన చేసింది. విడుదలైన అన్నీ చోట్ల బంపర్ కలెక్షన్స్ ని రాబడుతుందని ఆనందం వ్యక్తం చేసింది చిత్ర యూనిట్. 

సుకుమార్-బన్నీ-దేవిశ్రీ ప్రసాద్ కాంబోలో వచ్చిన హ్యాట్రిక్ చిత్రమిది. పాన్ ఇండియా సినిమాగా భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకొచ్చిన పుష్ప.. అంచనాలను మించి కలెక్షన్స్ రాబడుతోంది. మొదట్లో మిక్సిడ్ టాక్ వచ్చినా.. కలెక్షన్స్ పై ఏమాత్రం ప్రభావం పడలేదు. పుష్ప బ్లాక్ బస్టర్ ని బాలీవుడ్ ప్రేక్షకులు, విభిన్న చిత్రాలను ఇష్టపడే సినీ ప్రముఖులు, జనాలు అంటున్నారు. బాలీవుడ్ లో అయితే పుష్ప కలెక్షన్స్ రోజురోజుకి పెరుగుతున్నాయి. అక్కడ నాలుగురోజుల్లో రూ. 16కోట్లకుపైగా వసూల్ అయ్యాయి.

కన్నడ బ్లాక్ బస్టర్ కేజీఎఫ్ నాలుగు రోజుల్లో రూ. 200కోట్ల గ్రాస్ ని కలెక్ట్ చేస్తే.. ఇప్పుడా కలెక్షన్స్ ని పుష్ప క్రాస్ చేసింది. దేశంలోనే బిగ్గెస్ట్ గ్రాసర్ గా నిలిచింది. సుకుమార్ దర్శకత్వంలో పుష్పతెరకెక్కింది. బన్నీకి జంటగా రష్మిక మందన నటించింది. స్టార్ హీరోయిన్ సమంత ఐటమ్ సాంగ్ లో మెరిసింది. కన్నడ స్టార్ ఫాజిల్ ప్రతినాయకుడిగా కనిపించారు. సనీల్, అనసూయ తదితరులు కీలక పాత్రలో నటించారు.