మ‌ళ్లీ ముఖ్య‌మంత్రిగానే వ‌స్తా..!!

విజ‌య‌వాడ క‌న‌క‌దుర్గ‌మ్మ మొక్కు తీర్చుకున్న సీఎం కేసీర్ ఏపీ ప్ర‌భుత్వ ఏర్పాట్ల‌పై సంతృప్తిని వ్య‌క్తం చేశారు. అమ్మ‌వారి ద‌ర్శ‌నం అనంత‌రం స్థానిక నేత‌ల‌తో త‌న అభిప్రాయాల‌ను పంచుకున్నారు సీఎం కేసీఆర్. త‌న స‌మ‌క్షంలోనే అమ్మవారికి ముక్కుపుడ‌క‌ను అలంక‌రించ‌డం ఆనందంగా ఉంద‌ని చెప్పారు సీఎం. విజ‌య‌వాడ బాగా అభివృద్ధి చెందింద‌ని కితాబిచ్చారు. ఎయిర్ పోర్టు కూడా బాగుంద‌ని ప్ర‌శంసించారు. బంద‌ర్ రోడ్డును బాగా విస్త‌రించార‌ని, ఎయిర్ పోర్టు నుంచి బంద‌రు రోడ్డు వ‌ర‌కు గ్రీన‌రీ బాగుంద‌ని మెచ్చుకున్నారు. రోడ్డుకు ఇరువైపులా పెయింటింగులు బాగున్నాయ‌ని తెలిపారు సీఎం కేసీఆర్. మ‌ళ్లీ ముఖ్య‌మంత్రిగా వ‌చ్చి అమ్మ‌వారికి మొక్కులు తీర్చుకుంటాన‌ని సీఎం కేసీఆర్ ప్ర‌క‌టించారు.