పనామా పేపర్స్.. ఐష్ తర్వాత అమితాబ్, అజయ్ !

ప‌నామా పేప‌ర్స్ లో పేరున్న సినీ ప్రముఖులు ఈడీ (ఎన్ఫోర్స్మెంట్ డైరెక్ట‌రేట్ ) ముందు హాజరవుతున్నారు. ఈ క్ర‌మంలో న‌టి ఐశ్వ‌ర్య‌రాయ్ విచార‌ణ‌కు హాజ‌రైంది. దాదాపు ఆరు గంట‌ల పాటు ఆమెను ఈడీ అధికారులు ప్ర‌శ్నించిన‌ట్టుగా తెలుస్తోంది. ప‌లు వాయిదాల అనంత‌రం ఐశ్వ‌ర్య ఈడీ విచార‌ణ‌కు హాజ‌రైంది. మ‌రి త‌దుప‌రి చ‌ర్య‌లు ఏముంటాయో చూడాల్సి ఉంది.

ఇప్పటికే అభిషేక్ బచ్చన్ ఈడీ విచారణ ఎదుర్కొన్నారు. త్వరలోనే బిగ్ బీ అమితాబ్ కు నోటీసులు జారీ చేయనుంది. ఆయన విచారణకు హాజరుకాక తప్పదు తెలుస్తుంది. అలాగే మ‌రో బాలీవుడ్ న‌టుడు అజ‌య్ దేవ‌గ‌ణ్ కూడా ఈ వ్య‌వ‌హారాల్లో విచార‌ణ‌కు హాజ‌రు కావాల్సి ఉంద‌ని స‌మాచారం.

అయితే ప‌నామా పేప‌ర్స్ లీకేజ్ స‌మ‌యంలోనే వీరు వివ‌ర‌ణ ఇచ్చుకున్నారు. ఈ అంశంపై అమితాబ్ స్పందిస్తూ.. త‌నకు సంబంధం ఉన్న‌ట్టుగా పేర్కొన్న కంపెనీల‌తో త‌న‌కు ఎలాంటి సంబంధం లేద‌ని అమితాబ్ అప్ప‌ట్లోనే చెప్పాడు. ఇక అజ‌య్ దేవ‌గ‌ణ్ స్పందిస్తూ… బ్రిటిష్ వ‌ర్జిన్ ఐలాండ్స్ లో ఉన్న త‌న పెట్టుబ‌డుల‌కు సంబంధించి, త‌న పెట్టుబ‌డ‌ల‌న్నీ స‌క్ర‌మ ఛాన‌ల్స్ ద్వారానే వెళ్లాయ‌ని చెప్పుకొచ్చాడు.