గోపీచంద్-శ్రీవాస్ హ్యాట్రిక్.. అంతా సిద్ధం

గోపీచంద్-రాశీఖన్నా జంటగా నటించిన చిత్రం ‘పక్కా కమర్షియల్’. షూటింగ్ దాదాపు పూర్తయింది. త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. మరోవైపు గోపీచంద్-శ్రీవాస్ హ్యాట్రిక్ చిత్రం సెట్స్ మీదకు వెళ్లనుందని తెలిసింది. వీరి కాంబోలో వచ్చిన లక్ష్యం, లౌక్యం సినిమాలు మంచి విజయాన్ని సాధించాయి.

వీరి హ్యాట్రిక్ చిత్రం ఎల్లుండి (డిసెంబర్) నుంచే సెట్స్ మీదకు వెళ్లనుందని తెలుస్తోంది. విశ్వప్రసాద్ – వివేక్ కూచిభొట్ల ఈ సినిమాకి నిర్మాతలుగా వ్యవహరించనున్నారు. ‘సీటీమార్’తో హిట్ కొట్టిన గోపీచంద్.. అదే ఊపుతో కొత్త చిత్రాన్ని సెట్స్ మీదకు తీసుకెళ్తున్నారు. ఈ సినిమాలో హీరోయిన్ ఎవరు? ప్రతినాయకుడు ఎవరు? అనే విషయాలతో పాటు, ఇతర వివరాలు త్వరలో తెలియరానున్నాయి.