వడివేలుకు కరోనా పాజిటివ్

మరోసారి కరోనా బారినపడుతున్న సెలబ్రెటీల జాబితా పెరుగుతుంది. తాజాగా కోలీవుడ్ స్టార్ కమెడియన్ వడివేలుకు కరోనా పాజిటివ్ గా నిర్థారణ అయింది. ప్రస్తుతం ఆయన ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు.

సుధీర్ఘ కాలం తర్వాత ఆయన “నాయ్ శేఖర్ రిటర్న్స్” అనే చిత్రంలో నటిస్తున్నారు. సురాజ్ దర్శకత్వం వహించే ఈ చిత్రాన్ని ప్రముఖ భారీ చిత్రాల నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్ అధినేత సుభాస్కరన్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ ఇటీవల చెన్నై నగరంలో ప్రారంభమైంది. ఈ సినిమా పనుల కోసం లండన్ వెళ్లొచ్చిన వడివేలుకు కరోనా సోకింది. 

ఇటీవలే యూనివర్సల్ హీరో కమల్ హాసన్, కోలీవుడ్ స్టార్ హీరో విక్రమ్ కరోనా బారిపడిన సంగతి తెలిసిందే. బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ కరీనా కపూర్ కరోనాతో ప్రస్తుతం హోం క్వారంటైన్ లోనే ఉన్నారు.అయితే వడివేలులు కరోనా కొత్తరకం ఒమిక్రాన్ సోకిందా అనే ఆందోళనలో ఆయన అభిమానులు ఉన్నారు. దీనికి సంబంధించిన టెస్టుల రిపోర్టులు ఇంకా రావాల్సి ఉందని తెలుస్తోంది.