సామ్-చైతూ.. 2017 టు 2021

సమంత-నాగ చైతన్య.. చూడ చక్కని జంట. ఏమాయ చేసావె’ చిత్రంలో నాగచైతన్య-సమంతల జోడీ ప్రేక్షకుల మది దోచేసింది. ఈ సినిమాతో పరిచయమైన ఈ జంట.. ‘మనం’ ‘ఆటోనగర్‌ సూర్య’లతో ప్రేమికులయ్యారు. కొన్నేళ్లపాటు ప్రేమలో ఉన్న ఈ ఇద్దరూ పెద్దల అంగీకారంతో 2017లో వివాహబంధంలోకి అడుగుపెట్టారు.

పెళ్లి తర్వాత కూడా ఈ జంట తెరపై రొమాన్స్ చేసింది. వీరిద్దరూ కలిసి ‘మజిలీ’తో అలరించారు. మజిలీ విజయాన్ని చైతూ కంటే సామ్ నే ఎక్కువగా ఎంజాయ్ చేసింది. ఈ సినిమాతో చైతూ నటుడిగా ఓ మెట్టుపైకి ఎక్కాడని సంబరపడిపోయింది. అయితే దాంపత్య జీవితంలో మాత్రం తాము ఓ మెట్టు కిందికి దిగామని బహుశా… ఆ సమయంలో ఊహించి ఉండకపోవచ్చు.

నాలుగేళ్ల తమ వైవాహిక బంధానికి, సుమారు 11 ఏళ్ల ప్రేమకు స్వస్తి చెబుతూ.. అక్టోబర్‌ 2న విడిపోతున్నట్లు ప్రకటించి అందర్నీ షాక్‌కు గురి చేశారు. పరస్పర అంగీకారంతోనే విడిపోతున్నట్లు ఈ జంట చెప్పినప్పటికీ అభిమానులు మాత్రం ఆ విషయాన్ని జీర్ణించుకోలేకపోయారు.