కొత్త ఏడాదిలో బ్యాడ్ న్యూస్

పాత ఏడాది బై.. బై చెప్పేసి.. కొత్త ఏడాదికి వెల్ కమ్ టైమ్ చెప్పే సమయం వచ్చేసింది. మరికొద్ది గంటల్లో 2021 క్యాలెండర్ పూర్తికానుంది. 2022 క్యాలెండర్ లోకి అడుగుపెట్టబోతున్నాం. ఈ సందర్భంగా కొన్ని బ్యాడ్ న్యూస్ వినిపిస్తున్నాయి. ఇందులో ఒకటి బంగారం ధరలు. కొత్త ఏడాదిలో బంగారం ధరలు భారీగా పెరగనున్నాయి.

ఇటీవల కాలంలో 10 గ్రాముల పసిడి ధర రూ.50వేల లోపే పలుకుతోంది. అయితే, కొత్త ఏడాదిలో బంగారం పెరుగుదల తప్పేలా కన్పించట్లేదు. 2022లో పుత్తడి ధర మళ్లీ పెరిగే అవకాశముందని, 10 గ్రాముల ధర రూ.55 వేల పైకి చేరవచ్చని మార్కెట్‌ విశ్లేషకులు చెబుతున్నారు. బంగారం ధరలు పెరగడానికి కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్‌ కూడా ఓ కారణమని చెబుతున్నారు.