NewYear : మందు బాబుల కోసం ఆర్టీసీ ప్రత్యేక బస్సులు

న్యూ ఇయర్ వేడుకల్లో మస్త్ గా ఎంజాయ్ చేద్దామనుకుంటున్న మందు బాబులకు ఆర్టీసీ గుడ్ న్యూస్ చెప్పింది. డిసెంబర్ 31 రాత్రి ప్రత్యేక బస్సులను నడపనున్నట్టు ఆర్టీసీ ప్రకటించింది. సిటీ శివారులో ఉన్న ఈవెంట్స్ జరిగే ప్రాంతాలకు బస్సు సర్వీసు సౌకర్యం కల్పించనుంది. 

ఈవెంట్స్ వెళ్లే వారికోసం రాత్రి 7.30 నుంచి రాత్రి 9.30 గంటల వరకు, తిరుగు ప్రయాణం అర్ధరాత్రి 12.30నుంచి మరుసటిరోజు తెల్లవారుజాము 3గంటల వరకు బస్సు సేవలు అందిచనుంది. 18 సీట్ల ఏసీ బస్సు వెళ్లి రావటానికి రూ.4 వేల ప్యాకేజీని ప్రకటించింది. ఒకరికి రూ.100 వసూలు చేయనున్నట్లు ఆర్టీసీ తెలిపింది. ఆర్టీసి సూచించిన 15 ప్రాంతాల్లో బస్సులు అందుబాటులో ఉండనున్నాయి. అంతేకాదు.. ఆర్టీసీ ఎండీ సజ్జనార్ కొత్త సంవత్సర కానుక కూడా ప్రకటించారు. కొత్త సంవత్సరం కానుకగా జనవరి1వ తేదీన తల్లిదండ్రులతో ప్రయాణించే 12 ఏళ్ల లోపు పిల్లలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించనున్నట్లు సజ్జనార్ ట్వీట్ చేశారు.