డార్లింగ్సే.. గుడ్ న్యూస్

ప్రభాస్ అభిమానులకు గుడ్ న్యూస్. ఆర్ఆర్ఆర్ దారిలో రాధేశ్యామ్ కూడా వాయిదా పడనుంది అనే ప్రచారానికి చిత్రబృందం పులిస్టాప్ పెట్టేసింది. రాధేశ్యామ్ వాయిదా పడటం లేదు. ముందుగా నిర్ణయించిన జనవరి 14నే ప్రేక్షకుల ముందుకు వస్తుందని చిత్రబృందం కన్ఫామ్ చేసింది. మరోవైపు రాధేశ్యామ్ రిలీజ్ పోస్టర్లు, సరికొత్త బ్యానర్లు రెడీ అయిపోతున్నాయి.

దేశంలో కరోనా కేసులు, ఒమిక్రాన్ విజృంభిస్తోంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వాలు కఠిన ఆంక్షలు విధిస్తున్నాయి. ఇప్పటికే ఢిల్లీలో థియేటర్స్ క్లోజ్ అయ్యాయి. ముంబైలో 50శాతం ఆక్యుపెన్సీతోనే సినిమా హాల్స్ రన్ అవుతున్నాయి. మిగితా రాష్ట్ర ప్రభుత్వలు ఎప్పుడు ఎలాంటి కఠిన నిర్ణయాలు తీసుకుంటాయో అర్థంకానీ పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో ఆర్ ఆర్ ఆర్ వెనకడుగు వేసింది. అదే దారిలో రాధేశ్యామ్, అజిత్ ‘వాలిమై’ కూడా వాయిదా పడతాయని భావించారు. కానీ ప్రభాస్, అజిత్ ఇద్దరు రిస్క్ చేసేందుకు రెడీ అవుతున్నారు. సంక్రాంతి పండక్కి ప్రేక్షకులని అలరించేందుకు వస్తున్నారని తెలిసింది.

#Prabhas‘s #RadheShyam not postponed. pic.twitter.com/vfwpmRPL8j— OTTRelease (@ott_release) January 3, 2022