Official : ‘రాధేశ్యామ్’ విడుదల వాయిదా

దేశంలో కరోనా కేసులు, ఒమిక్రాన్ విజృంభిస్తున్న నేపథ్యంలో ఈ నెలలో రిలీజ్ కి రెడీగా ఉన్న సినిమాలన్నీ ఒక్కొక్కటిగా వాయిదా పడుతున్నాయి. ఇప్పటికే జెర్సీ, ఆర్ఆర్ఆర్, పృధ్వీరాజ్ సినిమాలు వాయిదా పడ్డాయి. తాజాగా ఈ జాబితాలో రాధేశ్యామ్ కూడా చేరిపోయింది. కొద్ది రోజులుగా రిలీజ్ వాయిదాపై సమాలోచనలు చేసిన చిత్రబృందం.. వాయిదా వేసేందుకే మొగ్గు చూపాయి. దీనిపై చిత్రబృందం అధికారిక ప్రకటన విడుదల చేసింది.

మరోవైపు రాధేశ్యామ్ ఓటీటీ రిలీజ్ పై ప్రచారం మొదలైంది. ప్రముఖ ఓటీటీ సంస్థ ఒకటి రాధేశ్యామ్ కు రూ. 400కోట్ల ఆఫర్ చేసిందట. ఇంకా డిస్కషన్స్ జరుగుతున్నాయి. ఒకట్రెండు రోజుల్లో రాధేశ్యామ్ ఓటీటీ రిలీజ్ పై క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది. రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో రాధేశ్యామ్ తెరకెక్కింది. ప్రభాస్-పూజా హెగ్డే జంటగా నటించారు. సీనియర్ రెబల్ స్టార్ ప్రభాస్ పరమహంస పాత్రలో కనిపించనున్నారు.