ఉత్త‌మ్ పై గ‌ర‌మైన టీకాంగ్రెస్ నేత‌..!!

గాంధీభవన్ లో ఏఐసీసీ కార్యదర్శుల సమావేశం వాడివేడిగా సాగింది. సమావేశ తీరు పై టి కాంగ్రెస్ నేతలు అసంతృప్తి వ్య‌క్తం చేశారు. టిపీసీసీ చీఫ్ ఉత్తమ్ పై నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవ రెడ్డి ఫైర్ అయ్యారు. కత్తి వెంకటస్వామిని నర్సంపేట కాంగ్రెస్ నేతగా పరిచయం చేయడం పై ఆయ‌న ఆగ్రహం వ్య‌క్తం చేశారు. కనీసం నాలుగు వేల ఓట్లు కూడా తెచ్చుకోలేని నేతకు త‌న‌తో సమానమైన హోదా ఎలా కల్పిస్తారని మండిప‌డ్డారు. ఒకానొక ద‌శ‌లో ఆగ్రహంతో పీసీసీ పైకి దూసుకెళ్లార‌ట కూడా. ఉత్త‌మ్ వ‌ల్లే పార్టీ నాశ‌న‌మ‌వుతుందంటూ తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.