20 వరకు స్కూల్స్ బంద్ ?

తెలంగాణలో కరోనా మరోసారి విజృంభిస్తుంది. ప్రతిరోజు దాదాపు రెండు వేల కొత్త కేసులు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ నెల 8 నుంచి 16 వరకు విద్యా సంస్థలకు సెలవులు ఇచ్చిన సంగతి తెలిసిందే.

అయితే రేపటితో సెలవులు ముగియనున్న నేపథ్యంలో మరికొన్నాళ్లు పొడిగించే అవకాశాలు కనిపిస్తున్నయి. ఈ నెల 20వ తేదీ వరకు రాష్ట్రంలో కరోనా ఆంక్షలు అమల్లో ఉంటాయి. అంటే అప్పటి వరకు ర్యాలీలు, సభలు, సమావేశాలు నిర్వహించకూడదని ప్రభుత్వం ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది.

ఈ నేపథ్యంలో విద్యా సంస్థల సంక్రాంతి సెలవులను కూడా అప్పటి వరకు పొడిగించాలని నిర్ణయించినట్టు చెబుతున్నారు. మరోవైపు మరోసారి ఆన్ లైన్ క్లాసులకు పెద్దపీఠ వేయాలని ప్రభుత్వం యోచిస్తుంది.