‘బాలయ్య-చిరంజీవి’ ఎందుకు వర్కవుట్ కాలేదు ?

బాలయ్య టాక్ షో ‘అన్ స్టాపబుల్ విత్ బాలయ్య’ సీజన్-1 పూర్తయింది. ఆఖరి ఏపీసోడ్ కు సూపర్ స్టార్ మహేష్ బాబు హాజరై సందడి చేశారు. అయితే ఈ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి ఎందుకు రాలేదు ? అనే చర్చ జరుగుతుంది. ఆహా టీమ్ చిరంజీవి కోసం ప్రయత్నం చేయలేదా? అల్లు అరవింద్ లైట్ తీసుకున్నారా? ఈ ప్రశ్నలన్నింటికీ అన్ స్టాపపబుల్ క్రియేటివ్ ప్రొడ్యూసర్ బీవీఎస్ రవి సమాధానం ఇచ్చాడు.

“బాలయ్య, చిరంజీవితో టాక్ షో అంటే దానికి చాలా ప్రిపరేషన్ కావాలి. అదంతా మేం స్టార్ట్ చేశాం కూడా. చిరంజీవి గారి ఎంట్రీ కంటే ముందు నుంచే బాలయ్య ఉన్నారు. చిరంజీవితో పోలిస్తే వయసులో బాలయ్య చిన్నవాడు, కానీ సీనియారిటీలో పెద్దవాడు. ఈ మేజిక్ ను రీక్రియేట్ చేద్దాం అనుకున్నాం. దానికి సంబంధించి వర్క్ కూడా జరిగింది. అన్నీ అనుకున్నట్టు జరిగితే రెండో సీజన్ బాలయ్య-చిరంజీవి టాక్ షోతోనే ఓపెన్ అవ్వొచ్చు.” అన్నారు బీవీఎస్ రవి.