మెగాస్టార్ ఎమోషనల్‌ పోస్ట్‌

మెగాస్టార్ చిరంజీవి ఇటీవలే కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం హోం ఐసోలేషన్ లో ఉంటున్నారు. శనివారం తన తల్లి పుట్టినరోజు పురస్కరించుకుని సోషల్‌మీడియా వేదికగా చిరు ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు.

తల్లి, సతీమణితో కలిసి దిగిన ఓ ఫొటోని ట్విటర్ వేదికగా షేర్‌ చేశారు. “అమ్మా.. నీకు జన్మదిన శుభాకాంక్షలు. క్వారంటైన్‌లో ఉన్న కారణంగా ప్రత్యక్షంగా కలుసుకొని నీ ఆశీస్సులు తీసుకోలేక ఇలా విషెస్‌ తెలుపుతున్నాను. నీ చల్లని దీవెనలు ఈ జన్మకే కాదు.. మరు జన్మలకి కూడా కావాలని ఆ భగవంతుడిని కోరుకుంటున్నా. ప్రేమతో.. శంకరబాబు” అని చిరు పేర్కొన్నారు.

ఇక సినిమాల విషయానికొస్తే మెగాస్టార్ ‘ఆచార్య’ రిలీజ్ కి రెడీగా ఉంది. ఈ నెలలోనే ఆచార్య ప్రేక్షకుల ముందుకు వస్తుందని అనుకున్నారు. కానీ ఆర్ఆర్ఆర్ విడుదల తర్వాతే ఆచార్యని రిలీజ్ చేయాలనే కండిషన్ పెట్టుకున్నారు. ఈ నేపథ్యంలో మార్చి 18 లేదా ఏప్రిల్ 28న ఆర్ ఆర్ ఆర్ విడుదల తర్వాత ఆచార్య థియేటర్స్ లోకి రానుంది. ప్రస్తుతం చిరు ‘భోళా శంకర్’ సినిమాలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి మెహర్ రమేష్ దర్శకుడు. తమన్నా కథానాయిక.

అమ్మా !🌻💐
జన్మదిన శుభాకాంక్షలు 🌷🌸

క్వరెంటైన్ అయిన కారణంగా నీ ఆశీస్సులు ప్రత్యక్షంగా తీసుకోలేక ఇలా తెలుపుతున్నా..

నీ చల్లని దీవెనలు ఈ జన్మకే కాదు మరు జన్మలకి కూడా కావాలని ఆ భగవంతుడ్ని కోరుకొంటూ 🙏

అభినందనలతో …. శంకరబాబు pic.twitter.com/DF6FS1eP3p— Chiranjeevi Konidela (@KChiruTweets) January 29, 2022