రెండు పార్టులుగా సలార్ ?

కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న చిత్రం ‘సలార్’. ఇప్పుడీ.. ఈ సినిమా గురించి ఓ షాకింగ్ గాసిప్ వినిపిస్తుంది. కేజీఎఫ్, పుష్ప సినిమాల మాదిరిగా సలార్ కూడా రెండు పార్ట్స్ గా రాబోతుందట. వాస్తవానికి సింగిల్ స్కిప్ట్ తోనే సలార్ సెట్స్ మీదకు వెళ్లింది. అయితే షూటింగ్ దాదాపు పూర్తి కావొస్తున్న నేపథ్యంలో నిడివి పెరిగిందని.. దీంతో రెండు పార్ట్స్ గా ప్లాన్ చేస్తున్నారని సమాచారం. దీనిపై చిత్రబృందం నుంచి స్పష్టత రావాల్సి ఉంది.

అయితే కొద్ది కాలంగా సలార్ కు రిపేర్లు జరుగుతున్నాయి. కొన్ని సీన్స్ ని రీ షూట్స్ చేస్తున్నారనే ప్రచారం జరుగుతుంది. అది రీ షూట్ కాదట. కొన్ని కొత్త సీన్స్ చిత్రీకరిస్తున్నారట. ఈ చిత్రంలో యాక్షన్ సీన్స్ హాలీవుడ్ రేంజ్ లో ఉండనున్నాయి. ఇందుకోసం టెక్నాలజీని బాగా వాడుతున్నారు. ఈ ఏడాది అక్టోబర్ సలార్ పార్ట్ -1, వచ్చే ఏడాది సమ్మర్ లో పార్ట్ 2 రిలీజ్ కోసం ప్లాన్ చేస్తున్నారని తెలిసింది. ప్రభాస్ కి జంటగా శృతి హాసన్ నటిస్తుంది. ఇక ప్రభాస్ నటిస్తున్న ప్రాజెక్ట్ కె, నాగ్ అశ్విన్ సినిమాలు ప్రస్తుతం సెట్స్ మీద ఉన్నాయి. ఆ తర్వాత సందీప్ వంగా దర్శకత్వంలో ప్రభాస్ స్పిరిన్ తెరకెక్కనుంది.