‘రంగస్థలం’లో అనుపమ పాత్ర అదే.. !

సుకుమార్ – రామ్ చరణ్’ల ‘రంగస్థలం’ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన సంగతి తెలిసిందే. నాన్ బాహుబలి రికార్డులని బద్దలుకొట్టింది. సినిమాలో చిట్టిబాబు పాత్ర తర్వాత రామలక్ష్మీ, రంగమ్మత్త పాత్రలు హైలైట్ గా నిలిచాయి. రామలక్ష్మీగా సమంత, రంగమ్మత్తగా అనసూయ అదరగొట్టారు. వాస్తవానికి రామలక్ష్మీ పాత్ర కోసం ముందుగా యంగ్ హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ ని అనుకొన్నారు. ఆ తర్వాత ఆమె స్థానంలో సమంతని ఫైనల్ చేశారు.

ఇన్నాళ్లకు ఈ విషయంపై అనుపమ స్పందించింది. ‘రంగస్థలం’ సినిమాలో సమంత పోషించిన రామలక్ష్మి పాత్ర కోసం ముందుగా తననే సంప్రదించారు. కొన్ని కారణాల వలన ఆ సినిమా చేయలేకపోయా. సినిమా చూసిన తర్వాత సమంత అద్భుతంగా చేసింది అనిపించింది. ఈ విషయాన్ని దర్శకుడు సుకుమార్ కూడా చెప్పా. తనకు తెలుగు మాట్లాడటంలో ఇబ్బంది లేదు. ‘అఆ’ సమయంలో త్రివిక్రమ్ తెలుగు నేర్పించారు అని చెప్పుకొచ్చింది అనుపమ.

కరుణాకరణ్ దర్శకత్వంలో సాయిధరమ్ తేజ్-అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన ‘తేజ్ ఐ లవ్ యూ’ ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో పాల్గొన్న అనుపమ ‘రంగస్థలం’ ఆఫర్ ని ప్రేక్షకులతో పంచుకొంది. అనుపమ రామలక్ష్మీ అయివుంటే ఇప్పటికే స్టార్ హీరోయిన్ అనిపించుకునేదేమో.. ! వరుసగా యంగ్ హీరోలతో జతకడుతున్నన అనుపమ స్టార్ హీరోల పిలుపు కోసం వేయి కళ్లతో ఎదురు చూస్తోంది.