భీమ్లా నాయక్ OTT డీల్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి కాంబోలో వస్తున్న సినిమా ‘భీమ్లా నాయక్’. సాగర్ కె చంద్ర దర్శకత్వం వహించారు. త్రివిక్రమ్ మాటలు-స్క్రీన్ ప్లే అందించారు. ఈ నెల 25న భీమ్లా నాయక్ ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. అయితే థియేట్రికల్ రిలీజ్ కు ముందే ఈ సినిమా ఓటీటీ రిలీజ్ డీల్ ఓకే అయింది. భారీ రేటుకు భీమ్లా నాయక్ పోస్ట్ థియేట్రికల్ ఓటీటీ రిలీజ్ రైట్స్ ను డిస్నీ ప్లస్ హాట్ స్టార్ సొంతం చేసుకున్నట్టు తెలుస్తుంది. ఇక శాటిలైట్ రైట్స్ ను స్టార్ మా సొంతం చేసుకున్నట్టు సమాచారం.

ఈ చిత్రంలో నిత్యా మీనన్ , సంయుక్త మీనన్ కూడా కథానాయికలుగా నటిస్తున్నారు. థమన్ సంగీతం. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై సూర్యదేవర నాగ వంశీ నిర్మిస్తున్నారు ఇప్పటికే బుక్ మై షోలో భీమ్లా నాయక్ టికెట్స్ బుక్ చేసుకోవడానికి లక్షల మంది ఆసక్తి చూపిస్తున్నారు. మరోవైపు ఏపీలో రాత్రి కర్ఫ్యూ ఎత్తేశారు. ఒకట్రెండు రోజుల్లోనే టికెట్ ధరల పెంపుపై ప్రకటన వస్తుందని చెబుతున్నారు. దీంతో.. భీమ్లా నాయక్ బాక్సాఫీస్ కలెక్షన్స్ అదిరిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి.